ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త! రాష్ట్రంలో భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని 40 నుంచి 42ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వయోపరిమితి పెంపు దస్త్రంపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేసినట్లు తెలిసింది.
వయోపరిమితి పెంపుదల ప్రకటనను నేడో రేపో చేయనున్నారు. ప్రభుత్వం అధికారికంగా వయోపరిమితి పెంపు ప్రకటన చేసిన అనంతరం..రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తారు.
తెలంగాణలో వరుసగా ఉద్యోగ ఖాళీలపై నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో...ఏపీ నిరుద్యోగులు కూడా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగాల కోసం ప్రైవేటు సంస్థల్లో కోచింగ్ కూడా తీసుకున్నారు.
వయోపరిమితి పెంపుదల ప్రకటనను నేడో రేపో చేయనున్నారు. ప్రభుత్వం అధికారికంగా వయోపరిమితి పెంపు ప్రకటన చేసిన అనంతరం..రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తారు.
తెలంగాణలో వరుసగా ఉద్యోగ ఖాళీలపై నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో...ఏపీ నిరుద్యోగులు కూడా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగాల కోసం ప్రైవేటు సంస్థల్లో కోచింగ్ కూడా తీసుకున్నారు.