విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడ్జెట్లో రూ.23 వేల కోట్లు కేటాయించారని మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ, నూజివీడు ట్రిపుల్ ఐటీల 4వ స్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మంత్రి గంటా మాట్లాడుతూ స్నాతకోత్సవంతో చదువు పూర్తయిందని విద్యార్థులు అనుకోవద్దని చెప్పారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ట్రిపుల్ ఐటీ విద్య అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చే విధంగా ఉందన్నారు.
ఛాన్స్లర్, ట్రిపుల్ ఐటీల రూపకర్త శ్రమించి ఎంతో ఉన్నత ప్రమాణాలతో వీటిని రూపొందించారన్నారు. ఫలితంగా ట్రిపుల్ ఐటీ చదువులకు దేశంలో గుర్తింపు లభిస్తోందన్నారు. ట్రిపుల్ ఐటీలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ట్రిపుల్ ఐటీల్లో పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రెండు ట్రిపుల్ ఐటీలకు అదనంగా శ్రీకాకుళం, ఒంగోలులో మరో రెండు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 4 ట్రిపుల్ ఐటీలు ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు.
ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో 3 ట్రిపుల్ ఐటీలు మాత్రమే ఉండేవన్నారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్హబ్గా చేయాలన్నదే సీఎం ఆశయమని గంటా తెలిపారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభకు పదనుపెట్టేందుకు జ్ఞానభేరి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అనంతరం విడతల వారీగా అన్ని యూనివర్శిటీల్లో ఏర్పాటుచేస్తామన్నారు.
ట్రిపుల్ ఐటీల్లో సైతం జ్ఞానభేరి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రిపుల్ ఐటీలలో విద్యను మరింత అభివృద్దిపరచడం కోసం 33 శాతం ఫ్యాకల్టీలను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేయనుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఛాన్స్లర్ రాజిరెడ్డి, వైస్ఛాన్స్లర్ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
ఛాన్స్లర్, ట్రిపుల్ ఐటీల రూపకర్త శ్రమించి ఎంతో ఉన్నత ప్రమాణాలతో వీటిని రూపొందించారన్నారు. ఫలితంగా ట్రిపుల్ ఐటీ చదువులకు దేశంలో గుర్తింపు లభిస్తోందన్నారు. ట్రిపుల్ ఐటీలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ట్రిపుల్ ఐటీల్లో పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రెండు ట్రిపుల్ ఐటీలకు అదనంగా శ్రీకాకుళం, ఒంగోలులో మరో రెండు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 4 ట్రిపుల్ ఐటీలు ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు.
ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో 3 ట్రిపుల్ ఐటీలు మాత్రమే ఉండేవన్నారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్హబ్గా చేయాలన్నదే సీఎం ఆశయమని గంటా తెలిపారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభకు పదనుపెట్టేందుకు జ్ఞానభేరి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అనంతరం విడతల వారీగా అన్ని యూనివర్శిటీల్లో ఏర్పాటుచేస్తామన్నారు.
ట్రిపుల్ ఐటీల్లో సైతం జ్ఞానభేరి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రిపుల్ ఐటీలలో విద్యను మరింత అభివృద్దిపరచడం కోసం 33 శాతం ఫ్యాకల్టీలను రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేయనుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఛాన్స్లర్ రాజిరెడ్డి, వైస్ఛాన్స్లర్ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.