యాప్నగరం

చంద్రన్న వరాలు ‘3.5 లక్షల కొత్త ఫింఛన్లు’

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇస్తామని ప్రకటించారు.

TNN 22 Dec 2016, 10:02 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే 3 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని యోచిస్తున్నామని, దానికి ప్రభుత్వ భూమిని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమం ఉంటుందని, ఆ సమయంలో కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు.
Samayam Telugu ap government announced 3 5 lakhs new pensions
చంద్రన్న వరాలు ‘3.5 లక్షల కొత్త ఫింఛన్లు’


చంద్రన్న బీమాతో సామాన్యుడికి భరోసా వచ్చిందన్నారు. ఇటీవలే పార్టీ జనచైతన్య యాత్రలను నిర్వహించామని... గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వంపై గతంలో కన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నారన్నారు.

ఏపీని 2029 నాటికి వ్యవసాయంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో వ్యవసాయాధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం సాగు విస్తీర్ణం 15 లక్షల హెక్టార్లు ఉందని, 2029 నాటికి 21 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొన్నామన్నారు టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని అప్పుడే రిజల్ట్‌ని అంచనా వేయొచ్చని ముఖ్యమంత్రి అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.