యాప్నగరం

ఏర్పేడు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు

చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.

TNN 21 Apr 2017, 6:23 pm
చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో మృతిని కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చిత్తూరు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఇది చాలా బాధాకరమని చంద్రబాబు ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
Samayam Telugu ap government announced a compensation of rs 5 lakh to the families of chittoor victims
ఏర్పేడు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు

Deeply saddened by the Chittoor incident, State Cabinet has announced a compensation of Rs 5 lakh to the families of the deceased. — N Chandrababu Naidu (@ncbn) April 21, 2017
కాగా, చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం లారీ బీభత్సం సృష్టించింది. భారీ లోడుతో వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని డీకొని అనంతరం పక్కనే ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. లారీ బీభత్సానికి తోడు విద్యుత్ వైర్లు తెగిపడి కొందరు, మంటలు చెలరేగి మరికొందరు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడటంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎంతమంది చనిపోయారనే విషయంపై స్పష్టత లేదు. ప్రమాదంలో మొత్తం 13 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చినా సంఖ్య 15 పెరిగినట్లు తెలిసింది. ఇప్పుడు 20 మంది చనిపోయినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడినవారిలో ఏర్పేడు సీఐ, ఎస్సై‌తో పాటు స్థానిక విలేకరులు కూడా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.