యాప్నగరం

బస్సు ప్రమాద బాధితులకు పరిహారం

మంగళవారం తెల్లవారుజామున కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

TNN 28 Feb 2017, 2:38 pm
మంగళవారం తెల్లవారుజామున కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ బస్సు ప్రమాద మృతులకు పరిహారాన్ని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చంద్రన్న బీమా పథకం వర్తించే వారికి రూ.5లక్షలు, చంద్రన్న బీమా లేని వారికి రూ.3 లక్షలు, ఇతర రాష్ట్రాల వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా, 30 మంది దాకా గాయపడ్డారు. కాగా ఏపీ డీజీసీ సాంబశివరావు బాధితలును పరామర్శించి వచ్చారు. బస్సు ప్రమాదానికి అతివేగమే కారణమని అన్నారు.
Samayam Telugu ap government announced compensation for bus accident victims
బస్సు ప్రమాద బాధితులకు పరిహారం


ఆ బస్సు దివాకర్ ట్రావెల్స్‌కు చెందినది. ప్రమాదం జరిగే సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో తూగుతున్నాడని సమాచారం. బాధితుల్లో ఎక్కువగా విశాఖపట్నం వాసులు ఉన్నారు. ప్రమాద సంఘటన జరిగిన తీరు, సహాయకచర్యలపై మంత్రి కామినేని, ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప ఆరా తీశారు. మృతదేహాలకు సాధ్యమైనంత త్వరగా శవపరీక్ష నిర్వహించి స్వస్థలాలకు తరలించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.