ఆర్టీసీ బస్సులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రమాదాలను తగ్గించడం కోసం డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆర్టీసీ యాజమాన్యానికి సూచించారు. ఏడాదికోసారి తప్పకుండా బస్సులకు ఫిట్నెస్ తనిఖీలు చేపట్టాలని ఆయ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. డొక్కుగా మారిన పాత బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 5 శాతం బస్సులు పదేళ్లకు పైగా సేవలు అందిస్తుండగా.. పది శాతం బస్సులు 12 లక్షల కి.మీ.కు పైగా ప్రయాణించాయి. దీంతో అవి ఎప్పుడు ఆగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవలే విజయవాడ, విశాఖ, అనకాపల్లిల్లో ఆర్టీసీ బస్సుల ప్రమాదం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాత బస్సుల స్థానంలో ఈ ఏడాది వెయ్యి బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 5 శాతం బస్సులు పదేళ్లకు పైగా సేవలు అందిస్తుండగా.. పది శాతం బస్సులు 12 లక్షల కి.మీ.కు పైగా ప్రయాణించాయి. దీంతో అవి ఎప్పుడు ఆగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవలే విజయవాడ, విశాఖ, అనకాపల్లిల్లో ఆర్టీసీ బస్సుల ప్రమాదం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాత బస్సుల స్థానంలో ఈ ఏడాది వెయ్యి బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.