యాప్నగరం

జగన్ పాదయాత్రకు మద్దతు.. 9మంది ఉపాధ్యాయుల సస్పెండ్

వైఎస్ జగన్‌ను కలిసిన 9మంది టీచర్లు.. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతు.. సర్వీసు రూల్స్ ఉల్లంఘించారంటూ 9మంది సస్పెండ్..

Samayam Telugu 2 Oct 2018, 1:59 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. 276వ రోజు మంగళవారం జగన్ విజయనగరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. యాత్రలో ప్రజలతో పాటూ కొందరు ఉద్యోగులు కూడా కలిసి తమ సమస్యల్ని ప్రతిపక్ష నేతకు విన్నవించుకుంటున్నారు. అయితే ఆదివారం జరిగిన పాదయాత్రలో 9మంది ఉపాధ్యాయులు జగన్‌ను కలవడం వివాదాస్పదమయ్యింది. టీచర్లు సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారంటూ డీఈవో సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది.
Samayam Telugu Jagan


అసలు విషయానికొస్తే.. పాదయాత్రలో భాగంగా ఇటీవలే వైసీపీ అధికారంలోకి వస్తే.. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ను రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు. సీపీసీ రద్దు చేస్తామని వైసీపీ అధినేత హామీ ఇవ్వడంతో.. ఆయన్ను విశాఖ జిల్లా ఆనందపురం, భీమిలి, అనంతగిరి మండలాలకు చెందిన 9మంది టీచర్లు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే పాదయాత్రలో పాల్గొని జగన్‌ను సీఎం చేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులు జగన్‌ను కలవడం గురించి పత్రికల్లో కూడా కథనాలు రావడంతో ఈ అంశం వివాదంగా మారింది.

టీచర్లు జగన్‌ను కలవడంతో డీఈవో సీరియస్‌ అయ్యారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకున్నారు. 9మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. టీచర్లు ప్రతిపక్ష నేతను కలిసే హక్కు కూడా లేకపోవడం దారుణమన్నారు. సస్పెండ్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.