యాప్నగరం

ఏపీ: నిరుద్యోగులకు శుభవార్త.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నిరుద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Samayam Telugu 18 Jul 2019, 8:50 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. బడ్జెట్‌తో కేటాయింపులతో పాటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న జగన్.. అమలుకు సిద్ధమయ్యారు.
Samayam Telugu ys jagan


రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సంస్థల్లో 75శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయి మెంట్ ఆఫ్ లోకల్ క్యాండేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ యాక్ట్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అంటే ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థల్లో 75శాతంమంది స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తారనమాట.
ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఉద్యోగాలకు సంబంధించి హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారంలోకి రాగానే.. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు స్వాగతించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.