యాప్నగరం

ఆర్టీజీఎస్‌తో చంద్రబాబు అనుబంధం తెగినా.. ఈ బాబు బంధం తెగలేదు!

ఆర్టీజీఎస్‌ సీఈవోగా అహ్మద్ బాబును ఏపీ ప్రభుత్వం నియమించింది. జూలై తొలి వారంలోనే ఆయన్ను బదిలీ చేసిన సర్కారు తిరిగి ఆయన్నే ఆ పదవిలో నియమించడం విశేషం.

Samayam Telugu 16 Jul 2019, 4:22 pm
ఆర్టీజీఎస్‌ సీఈవోగా అహ్మద్ బాబును నియమిస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ఎల్వీ సుబ్రహ్మణం ఆదేశాలు జారీ చేశారు. జూలై తొలి వారంలోనే ఆయన్ను బదిలీ చేసి ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌ మాదిరెడ్డి ప్రతాప్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్లీ అహ్మద్ బాబుకే ఆర్టీజీఎస్ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడం గమనార్హం. రియల్ టైం గవర్నెన్స్ సంక్షిప్త రూపమే ఆర్టీజీఎస్. చంద్రబాబు సర్కారు హయాంలో 2017 నవంబర్ 24న ఆర్టీజీఎస్‌ను ప్రారంభించారు. దీని కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సెక్రటేరియట్‌లో ఉంది. ఈ వ్యవస్థ ఏర్పాటైన ఏడాదిలోనే పౌరసరఫరాల శాఖకు రూ.1600 కోట్లు ఆదా అయ్యాయి.
Samayam Telugu RTGS


ఈ వ్యవస్థను ఉపయోగించుకొని విపత్తులు తలెత్తినప్పుడు, ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించగలుగుతోంది. ఫణి తుఫాన్ సమయంలో ఒడిశా ప్రభుత్వానికి ఆర్టీజీఎస్ చేసిన నిరంతర సూచనలు ఉపయోగపడ్డాయి. నిఘా వ్యవస్థకు కూడా ఇది ఉపయోగడుతోంది.

వడగాలులు, వర్షాల సమయంలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడానికి వీలవుతుంది. పరీక్ష ఫలితాలు, డాష్‌బోర్డుల ద్వారా ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించొచ్చు. వివిధ విభాగాల పనితీరు ఎలా ఉందో డ్యాష్ బోర్డు ద్వారా తెలుసుకోవచ్చు.

ఆర్టీజీఎస్‌ అద్భుతంగా ఉందని గతంలో నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు గుప్పించారు. ఆర్టీజీఎస్‌ను పరిశీలించాలని ప్రతి రాష్ట్రానికి తాము సిఫారసు చేస్తామని గతంలో ఆయన తెలిపారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా ఆర్టీజీఎస్‌ను సందర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.