యాప్నగరం

జగన్‌ది అబద్దాల యాత్ర... ప్రభుత్వ చీఫ్ విప్!

వైసీపీ అధినేత జగన్ చేస్తోన్న పాదయాత్రపై టీడీపీ నేత, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

TNN 20 Nov 2017, 12:45 pm
వైసీపీ అధినేత జగన్ చేస్తోన్న పాదయాత్రపై టీడీపీ నేత, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అప్పులన్నీ తన కొడుకు జగన్ ఎదుగుదలకే ఖర్చు చేశారు తప్ప రాష్ట్రాభివృద్ధికి కాదని రఘునాథరెడ్డి విమర్శించారు. మద్యపానాన్ని నిషేధిస్తామనే హామీతో నాడు అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి, ఆ మద్యాన్నే ప్రభుత్వ ఆదాయ వనరుగా మార్చేశారని ఆయన గుర్తుచేశారు.
Samayam Telugu ap govt chief vip palle raghunatha reddy fires on ys jagan
జగన్‌ది అబద్దాల యాత్ర... ప్రభుత్వ చీఫ్ విప్!


జగన్‌ది ప్రజా సంకల్ప యాత్ర కాదని, అది అబద్ధాల యాత్ర అని దుయ్యబట్టారు. అవినీతి ద్వారా అక్రమాస్తులు పోగేసుకున్న ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదని మండిపడ్డారు. రుణమాఫీ పథకం ద్వారా రైతులకు రూ.27 వేల కోట్లు రుణాలను రద్దుచేసి రికార్డు సృష్టించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు చేస్తున్నారని రఘనాథరెడ్డి పేర్కొన్నారు. నాడు వైఎస్ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, నేడు చంద్రబాబు హయాంలో రైతులకు భరోసా కల్పించారని తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.