ఏపీ ఉద్యోగులు అమరావతికి తరలి వెళుతున్నారు. సహకార, వాణిజ్య, సమాచార శాఖకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో విజయవాడ బయల్దేరి వెళ్లారు. ఇన్నాళ్లు కలిసిపనిచేసిన తెలంగాణ ఉద్యోగులు వారికి వీడ్కోలు పలకగా... విజయవాడలో వారికి పుష్ప గుచ్ఛాలతో స్వాగతం లభించింది. కాగా వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పనిచేస్తున్న పద్మ తన ప్రయాణాన్ని భిన్నంగా మొదలుపెట్టారు. అందరిలా బస్సులో కాకుండా సైకిల్ పై అమరావతి బయల్దేరారు. ఉద్యోగుల్లో స్పూర్తి నింపేందుకే తానిలా ప్రయాణిస్తున్నానని తెలిపారు. ఆమె ప్రయాణాన్ని ఏపీ ఉద్యోగు సంఘం నాయకుడు అశోక్ బాబు ప్రారంభించారు.
అమరావతికి సైకిల్ పై ఏపీ ఉద్యోగిని
ఏపీ ఉద్యోగులు అమరావతికి తరలి వెళుతున్నారు.
TNN 24 Jun 2016, 11:49 am