యాప్నగరం

ఏపీలో తల్లిసురక్ష పథకం.. ప్రయివేట్ హాస్పిటల్స్‌లో ఉచిత ప్రసవాలు!

కేరళ వంటి రాష్ట్రాల్లో 70- 80 శాతం ప్రసవాలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే జరుగుతాయి. కాబట్టి అక్కడ మతా శిశు మరణాల రేటు తక్కువగా ఉంటోంది. దీన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జనవరి 2019 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది.

Samayam Telugu 31 Dec 2018, 7:56 am
ఏపీలో నిరుపేద గర్భిణులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో సైతం నగదు రహిత కాన్పునకు అవకాశం కల్పించే తల్లిసురక్ష పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అత్యవసరంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన పేదింటి గర్భిణులు పైసా చెల్లించకుండా సురక్షిత కాన్పునకు అవకాశం కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో భాగంగా సహజ ప్రసవానికి రూ.8వేలు, శస్త్రచికిత్సకు రూ.14వేలు చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా ఎన్టీఆర్‌ వైద్యసేవ కిందకు దీనిని తీసుకొచ్చారు. తల్లి సురక్ష పథకం కింద ఏటా ఐదులక్షల మంది గర్భిణులకు లబ్ధి కలుగుతుంది. ఈపథకం అమలు కోసం రూ.500 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది.
Samayam Telugu NTR


2017-18 ఆర్థిక సంవత్సరానికి హాస్పిటల్స్‌లో సురక్షిత కాన్పుల సంఖ్య దాదాపు 6 లక్షల 96 వేలుగా కాగా, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 3 లక్షల 23 వేల కాన్పులు జరగ్గా, మిగతావి ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగాయని అధికారులు వివరించారు. ప్రసవ సమయంలో తల్లుల మరణాలు 2014-15లో 8,320 నమోదు అయితే ప్రస్తుత ఏడాది 65కు తగ్గిందని వెల్లడించారు. ప్రస్తుతం లక్షకు 65గా ఉన్న తల్లుల మరణాల రేటును 50కి తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. మరోవైపు కేరళ వంటి రాష్ట్రాల్లో 70- 80 శాతం ప్రసవాలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే జరుగుతాయి. కాబట్టి అక్కడ మతా శిశు మరణాల రేటు తక్కువగా ఉంటోంది. దీన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. జనవరి 2019 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది.

గైనిక్‌ సేవలు ట్రస్ట్‌ పరిధిలోకి తీసుకురావడంతో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయి. ప్రస్తుతం ట్రస్ట్‌ ద్వారా ఆర్థో, కార్డియాక్‌, న్యూరాలజీ సమస్యలకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం వల్ల ప్రభుత్వాస్పత్రులకు నిధులు సమకూరడంతో పాటు చికిత్సకు అయ్యే ఖర్చులో సుమారు 35శాతం వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్స్‌ రూపంలో అందుతాయి. కొత్త విధానంలో గర్భిణి సేవలకు కూడా ఇన్సెంటివ్స్‌ వస్తాయి కాబట్టి ప్రభుత్వాస్పత్రుల్లోని గైనిక్‌ వైద్యులు మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.