యాప్నగరం

ఏపీ: ముగ్గురు ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక

ఏపీ సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక పూర్తయ్యింది. ఈ పోస్టుల కోసం గతంలోనే దరఖాస్తుల్ని పిలిచిన ప్రభుత్వం.. అభ్యర్థుల అప్లికేషన్లను పరిశీలించి ముగ్గుర్ని సెలక్ట్ చేసింది.

Samayam Telugu 13 Jul 2018, 7:21 am
ఏపీ సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక పూర్తయ్యింది. ఈ పోస్టుల కోసం గతంలోనే దరఖాస్తుల్ని పిలిచిన ప్రభుత్వం.. అభ్యర్థుల అప్లికేషన్లను పరిశీలించి ముగ్గుర్ని సెలక్ట్ చేసింది. వారిలో రిటైర్డ్ ఐపీఎస్ బీవీ రమణకుమార్, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ మాతంగి రవికుమార్, హైకోర్టు సీనియర్ లాయర్ కట్టా జనార్థన్ రావులు ఉన్నారు. వీరి ముగ్గురి పేర్లను గవర్నర్‌ ఆమోదం కోసం పంపించనున్నారు. ఆయన ఓకే చేస్తే అధికార లాంఛనం పూర్తవుతుంది. ఇక ప్రధాన కమిషనర్ నియామకంపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
Samayam Telugu RTI..


ఆర్టీఐ కమిషనర్ల నియమించాలంటే సీఎంతో పాటూ ప్రతిపక్ష నేత కూడా సమావేశానికి రావాల్సి ఉంటుంది. గతంలో పాదయాత్రలో ఉన్న జగన్‌కు సమాచారం అందించగా.. ఆయన రావడం కుదరడం లేదని తెలిపారు. గురువారం రోజు జరిగి భేటీకి కూడా ప్రతిపక్ష నేతకు సమాచారం ఇచ్చారు. కాని ప్రజా సంకల్పం యాత్రలో ఉన్నామని చెప్పడంతో.. చంద్రబాబు, ఆర్థిక మంత్రి యమనలలు సమావేశమై దరఖాస్తుల్ని పరిశీలించి ఈ ముగ్గురి పేర్లను ఫైనల్ చేశారు.

ఆర్టీఏ కమిషనర్‌గా ఎంపికైన బీవీ రమణకుమార్‌ది కృష్ణా జిల్లా కైకలూరు. ఐపీఎస్ అధికారిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. మాతంగి రవికుమార్‌ ఐఎఫ్ఎస్‌గా చాలా పోస్టుల్లో విధులు నిర్వర్తించారు. చీఫ్ కన్జర్వేటర్ హోదాలో గతేడాది పదవీ విరమణ పొందారు. ఇక కట్టా జనార్థన్‌రావుది కడపజిల్లా. తిరుపతిలోని వెంకటేశ్వర వర్శిటీలో బీఎల్ పూర్తి చేశారు. 1985 నుంచి లాయర్‌గా సేవలందిస్తు జనార్థన్ రావుకు.. హైకోర్టులో 32 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.