యాప్నగరం

'హ్యాపీ సిటీ'గా అమరావతిని తీర్చిదిద్దుతాం: చంద్రబాబు

అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌ను... ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌తో కలిసి సీఎం ప్రారంభించారు.

Samayam Telugu 10 Apr 2018, 2:10 pm
అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌ను... ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‌తో కలిసి సీఎం ప్రారంభించారు. మూడు రోజులు పాటూ జరగనున్న ఈ సదస్సుకు 37 దేశాలకు చెందిన 1200మందికిపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు పరిష్కార మార్గాలు, ఆవిష్కరణలపై చర్చించనున్నారు. వీటిలో ప్రధానంగా ఏడు అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే రెండు అంశాలపై వర్క్‌షాపుల్ని నిర్వహిస్తున్నారు.
Samayam Telugu Babu


అత్యున్నత ప్రమాణాలతో అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం చంద్రబాబు. అందుకే అమరావతి నిర్మాణంలో అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధానాల కోసం అన్వేషిస్తున్నామని... అందుకు అందరూ సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఏపీలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో హ్యాపీ సండేలు నిర్వహిస్తున్నామని... ఏపీ రాజధానిలో ఇలాంటి సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఏపీని అత్యంత సంతోష రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు చంద్రబాబు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.