యాప్నగరం

ఏబీ వెంకటేశ్వరరావుకు కీలక పదవి.. ఏసీబీ డీజీగా నియామకం

బదిలీ వేటుకు గురైన ఏబీ వెంకటేశ్వర రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఏసీబీ డీజీగా నియమిస్తూ సీఎస్ ఎల్వీ సుమ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

Samayam Telugu 22 Apr 2019, 5:08 pm
పీ ఎన్నికల సమయంలో బదిలీ వేటుకు గురైన ఏబీ వెంకటేశ్వరరావుకు కీలక పదవీ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా ఆయణ్ని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం (ఏప్రిల్ 22) ఉత్తర్వులు జారీచేశారు. గవర్నర్ నరసింహన్ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూరే ఇప్పటిదాకా ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Samayam Telugu ab
ఏబీ వెంకటేశ్వరరావు


ఇంతకుముందు ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావును ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసింది. నేటివరకు ఆయనకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వెయిటింగ్‌లో ఉన్న ఆయణ్ని ఏసీబీ డీజీగా నియమిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు. వెంకటేశ్వరరావును తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు 1989 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.