ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కావేరీ తరహా జలయుద్ధం జరిగే అవకాశమే లేదని ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టును ఆయన తన అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ తెలంగాణ అధికారులతో ఏపీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. ఇచ్చిపుచ్చుకునే దోరణిలో పనిచేయడం వల్ల రెండు దాయాది రాష్ట్రాల మధ్య ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకునే పరిస్థితి లేదన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పులిచింతలకు పెద్ద ఎత్తున నీరు చేరి జలకళ ఏర్పడింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు చేరింది. ఎప్పటికప్పుడు నీటి మట్టం పెరుగుతోందని ఇది త్వరలోనే 30 టీఎంసీల సామర్థ్యాన్ని చేరుకోవచ్చని మంత్రి విశ్లేషించారు.
ఏపీ,తెలంగాణలకు జలయుద్ధం రాదు
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కావేరీ తరహా జలయుద్ధం జరిగే అవకాశమే లేదని ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు
TNN 14 Sep 2016, 9:15 pm