ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పట్నంలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజధాని అమరావతిని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. నగర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని బాబు పిలుపునిచ్చారు. విశాఖ నగరం దేశంలోనే అద్భుత నగరమని.. ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని... గతేడాది దేశ వృద్ధిరేటు 7.5శాతంగా ఉంటే.. ఏపీ వృద్ధిరేటు 10.99 శాతంగా నమోదైందని తెలిపారు. గతేడాది రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం 927 ఒప్పందాలు కుదిరాయని.. అందులో 659 ఎంవోయూలను ఆమోదించామన్నారు. వీటి ద్వారా రూ.2.82లక్షల పెట్టుబడి వచ్చినట్లు చెప్పారు. పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆధార్ అనుసంధానంతో వేలిముద్ర ద్వారా లావాదేవీలు జరుపుకునే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. డిజిటల్ ఇండియా నిర్మాణానికి ఏపీ ప్రజలు తమవంతుగా స్పందిస్తున్నారని...క్యాష్ లెస్ చెల్లింపులను ప్రొత్సహిస్తున్నామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వృద్ధిరేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని... గతేడాది దేశ వృద్ధిరేటు 7.5శాతంగా ఉంటే.. ఏపీ వృద్ధిరేటు 10.99 శాతంగా నమోదైందని తెలిపారు. గతేడాది రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం 927 ఒప్పందాలు కుదిరాయని.. అందులో 659 ఎంవోయూలను ఆమోదించామన్నారు. వీటి ద్వారా రూ.2.82లక్షల పెట్టుబడి వచ్చినట్లు చెప్పారు. పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆధార్ అనుసంధానంతో వేలిముద్ర ద్వారా లావాదేవీలు జరుపుకునే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. డిజిటల్ ఇండియా నిర్మాణానికి ఏపీ ప్రజలు తమవంతుగా స్పందిస్తున్నారని...క్యాష్ లెస్ చెల్లింపులను ప్రొత్సహిస్తున్నామని అన్నారు.