‘భీమవరం డియో డియో డిసక డిసక’ జుగుప్సాకరం -నన్నపనేని
వివాదంగా మారిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం యూత్ క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో అశ్లీల నృత్యాల ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు.
TNN 30 Dec 2017, 8:04 pm
వివాదంగా మారిన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం యూత్ క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో అశ్లీల నృత్యాల ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. భీమవరం ఘటనను ఖండిస్తున్నా.. అక్కడ జరిగిన డాన్సులు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఎక్కడా అలాంటి డాన్సులకు అనుమతించేదిలేంటూ జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చారు నన్నపనేని. అయితే జరిగిన సంఘటనను అవకాశంగా తీసుకుని తనను సురభి నాటకాల కంపెనీ ఆర్టిస్టులతో పోల్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీకి ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కౌంటర్ ఇచ్చారు. ఆమెకు దమ్ము, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
‘నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు. ఈ వయసులో కూడా తాను ప్రజల సమస్యపై శ్రమిస్తున్నానని’ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. తనను నాటకాలదాన్నని విమర్శలు చేస్తున్నవారు.. సురభి నాటక కంపెనీ చరిత్ర, గొప్పదనం గురించి తెలుసుకోవాలన్నారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదని.. విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ.. ఆ కుటుంబాన్ని త్వరలోనే పరామర్శించి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు నన్నపనేని.
‘నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు. ఈ వయసులో కూడా తాను ప్రజల సమస్యపై శ్రమిస్తున్నానని’ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. తనను నాటకాలదాన్నని విమర్శలు చేస్తున్నవారు.. సురభి నాటక కంపెనీ చరిత్ర, గొప్పదనం గురించి తెలుసుకోవాలన్నారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదని.. విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ.. ఆ కుటుంబాన్ని త్వరలోనే పరామర్శించి ప్రభుత్వం తరపున న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు నన్నపనేని.