యాప్నగరం

లంచగొండి ఆధికారికి అమరావతిలో 15 ప్లాట్లు!

భారీ స్థాయిలో అక్రమ ఆస్తులతో ఏసీబీకి పట్టుబడిన శ్రీకాకుళం జిల్లా గనుల శాఖ సహాయ జియాలజిస్టు

TNN 15 Nov 2017, 10:20 am
భారీ స్థాయిలో అక్రమ ఆస్తులతో ఏసీబీకి పట్టుబడిన శ్రీకాకుళం జిల్లా గనుల శాఖ సహాయ జియాలజిస్టు బత్తు హనుమంతరావు గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లంచావతారం నూతన రాజధాని ప్రాంతమైన సీఆర్‌డీఏ పరిధిలోనే ఏకంగా 15 చోట్ల ప్లాట్లు కొన్నాడు అంటే... ఇతడి అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భార్య పేరుతో ఏకంగా గ్రానైట్ కంపెనీనే ఏర్పాటు చేశాడీయన. మొత్తంగా హనుమంతరావు అక్రమాస్తుల విలువ రూ.50కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ఒక అంచనా. మార్కెట్ రేటు ప్రకారం లెక్క గడితే ఈ ఆస్తుల విలువ ఇంకా కొన్ని రెట్లు పెరగవచ్చు.
Samayam Telugu ap mines dept official held after acb raids in da case
లంచగొండి ఆధికారికి అమరావతిలో 15 ప్లాట్లు!


ఐదు లక్షల రూపాయల లంచం తీసుకొంటూ ఈ ఏడాది సెప్టెంబర్ 19న పట్టుబడ్డాడు హనుమంతరావు. అక్కడ నుంచి ఏసీబీ అధికారులు విచారణ మొదలుపెట్టగా.. తీగలాగితే డొంకంతా కదిలింది. హనుమంతరావుకు భారీ ఎత్తున అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు.

పాతికేళ్ల కిందట రూ.2,200తో హనుమంతరావు ఉద్యోగ జీవితం ప్రారంభమైందని, ప్రస్తుతం ఇతడి జీతం రూ.70 వేలు అని తెలుస్తోంది. మరి జీతం ఇంతే అయినా.. అక్రమసంపాదన విషయంలో మాత్రం హనుమంతరావు కోట్లకు పడగులు ఎత్తినట్టుగా అధికారులు ధ్రువీకరించారు. ప్రధానంగా ఇళ్లస్థలాల మీదే ఇతడు డబ్బంతా పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. సీఆర్డీఏ పరిధిలోనే అరవై శాతం ఆస్తులను కలిగి ఉన్నాడట ఈయన. తల్లి, భార్య, కుమారుడి పేర్ల మీద ఏకంగా 24 ఫ్లాట్లు, ప్లాట్లను కలిగి ఉన్నాడట. భార్య పేరిట ఉన్న గ్రానైట్ కంపెనీ అదనం. హనుమంతరావును అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.