యాప్నగరం

ఏపీ మంత్రికి లోక్‌సభ స్పీకర్ ఎవరో తెలియదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తప్పులో కాలేశారు.

Samayam Telugu 21 Jul 2017, 4:19 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణాశాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తప్పులో కాలేశారు. లోక్ స్పీకర్ షీలా దీక్షిత్ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వివాహ రిసెప్షన్ ఈ నెల 19న ఢిల్లీలో జరిగింది. ఈ వేడకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మోదీ రామ్మోహన్ నాయుడు దంపతులను అభినందిస్తున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు అక్కడే ఉన్నారు.
Samayam Telugu ap minister atchennaidu tumbles as he writes shiela dikshit loksabha speaker
ఏపీ మంత్రికి లోక్‌సభ స్పీకర్ ఎవరో తెలియదు


దీంతో ఆ ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘సదరు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రధానమంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, లోకసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీమతి షీలాదీక్షిత్ గారు, ఇతర కేంద్ర మంత్రులు మరియు గౌరవ మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు’ అంటూ పోస్ట్ చేశారు.


వాస్తవానికి ప్రస్తుత లోక్ సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్ కొనసాగుతున్నారు. అచ్చెన్నాయుడు మాత్రం స్పీకర్ షీలా దీక్షిత్ అని పేర్కొన్నారు. షీలా దీక్షిత్ ఢిల్లీకి సీఎం పని చేశారే తప్ప ఆమె లోక్ స్పీకర్ గా పనిచేయలేదు. దీంతో మంత్రి ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉండకూడదా? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.