యాప్నగరం

తిరుపతిలో స్విచ్ వేస్తే..జగన్ దగ్గర లైట్ వెలిగింది: ఏపీ మంత్రి

వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే... జగన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

Samayam Telugu 13 May 2018, 12:44 pm
వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే... జగన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. మార్నింగ్, ఈవెనింగ్ వాక్ చేస్తున్న ప్రతిపక్ష నేతకు అమిత్ షా దేవుడిగా... ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు రాక్షసుడిలా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అమిత షా ముందు శాంతియుతంగా నిరసన తెలిపితే... రాళ్ల దాడి చేశారని జగన్ ఆరోపించడం ఏంటని ప్రశ్నించారు. అంటే తిరుపతిలో స్విచ్ వేస్తే... జగన్ దగ్గర లైట్ వెలిగిందన్నారు. అలాగే కర్ణాటకలో బీజేపీ గెలుపు కోసం వైసీపీ నేతలు, విజయసాయిరెడ్డి పనిచేశారని విమర్శించారు.
Samayam Telugu Uma


అధికారం కోసం జగన్ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి ఉమ. కొల్లేరు గురించి మాట్లాడుతున్న ఆయన... తన తండ్రి హయాంలో బాంబులు పెట్టి కొల్లేరును ధ్వంసం చేసిన చరిత్రను మర్చిపోయారా అని ప్రశ్నించారు. సాగునీటి కోసం ప్రభుత్వం వేల రూపాయలు ఖర్చు చేస్తుంటే.... ఓర్చుకోలేక ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పాదయాత్ర కోసం గోదావరి జిల్లాకు వెళుతున్న జగన్... పోలవరం కుడి కాలువ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే దుర్మార్గపు ఆలోచనలు మారతాయన్నారు మంత్రి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.