యాప్నగరం

ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు: గంటా

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. వైసీపీ పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ విఫలమైందని.. వైసీపీ మీద ప్రజలకు నమ్మకం లేదని ఈ బంద్‌తో తేలిపోయిందని అన్నారు.

Samayam Telugu 24 Jul 2018, 7:43 pm
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. అమరావతిలో మంగళవారం (జులై 24) ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ విఫలమైందని.. వైసీపీ మీద ప్రజలకు నమ్మకం లేదని ఈ బంద్‌తో తేలిపోయిందని అన్నారు. ఏపీలోని ఇతర రాజకీయ పార్టీలు సైతం జగన్ పార్టీపై నమ్మకం లేకనే బంద్‌కు మద్దతు తెలపలేదని వెల్లడించారు. గతంలో కూడా రిపబ్లిక్ డే రోజు బంద్ చేసి జగన్ విఫలమయ్యాడని గంటా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Samayam Telugu Ganta


2019లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. ఎన్నికలు రాకుండా చూసుకొని వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదింప చేయించుకున్నారని గంటా విమర్శించారు. వైసీపీకి ఈ సారి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.