యాప్నగరం

బందరుకు 'చిరు' సాయం.. థ్యాంక్స్ చెప్పిన ఏపీ మంత్రి

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కలిశారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లిన ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేంటి మంత్రి కలవడం.. కృతజ్ఞతలు చెప్పడం ఏంటి అనుకుంటున్నారా.

Samayam Telugu 21 Jun 2018, 5:50 pm
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కలిశారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లిన ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేంటి మంత్రి కలవడం.. కృతజ్ఞతలు చెప్పడం ఏంటి అనుకుంటున్నారా. అసలు విషయం ఏంటంటే.. చిరంజీవి గతంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరుకు) తన ఎంపీ నిధుల నుంచి రూ.5 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అందుకే ఇప్పుడు మెగాస్టార్‌ను మంత్రి కలిశారు.
Samayam Telugu Kollu



కొల్లు రవీంద్ర మంత్రి మాత్రమే కాకుండా.. మచిలీపట్నం ఎమ్మెల్యే కావడంతోనే చిరంజీవిని స్వయంగా కలిశారు. ఎంపీ నిధుల ద్వారా జరుగుతున్న పనుల పురోగతిని మెగాస్టార్‌కు వివరించారట. మరో ఏడాదిలోగా మిగిలిన పనుల్ని పూర్తి చేస్తామని చెప్పారట. నిధులు కేటాయించినందుకు నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారట. అయితే తాను కేటాయించిన నిధులతో పనులు విజయవంతంగా జరగడంపై చిరంజీవి కూడా సంతోషం వ్యక్తం చేశారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.