యాప్నగరం

కర్నూలు టీడీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసిన లోకేష్

కర్నూలు పర్యటనలో మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. నగరంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో.. కర్నూలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు.

Samayam Telugu 10 Jul 2018, 7:54 am
కర్నూలు పర్యటనలో మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. నగరంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో.. కర్నూలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డి.. ఎంపీగా బుట్టా రేణుకల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. అభ్యర్థులని నేరుగా లోకేష్ ప్రకటించకపోయినా.. వారిద్దర్ని గెలిపించాలనడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
Samayam Telugu Lokesh


మంత్రి లోకేష్ వ్యాఖ్యలతో . వేదికపైనే ఉన్న టీజీ వెంకటేష్ అవాక్కయ్యారట. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వెంకటేష్ ఎస్వీ మోహన్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఎస్వీ టీడీపీ గూటికి చేరారు. తర్వాత టీజీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చింది. దీంతో అతడి కుమారుడు భరత్ నియోజకవర్గంలో బాగా యాక్టివ్ అయ్యారు. ఆయన కూడా కర్నూలు అసెంబ్లీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ టిక్కెట్‌ వ్యవహారంపై ఎమ్మెల్యే ఎస్వీ-భరత్ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. తర్వాత అధిష్టానం పిలిచి సమన్వయంతో పనిచేయాలని చెప్పడంతో కాస్త సైలంటయ్యారు. మళ్లీ ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలతో టీజీ వర్గానికి పెద్ద షాకే తగిలింది.

ఇటు ఎంపీ బుట్టా రేణుక కూడా 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచారు. ఇటీవలే ఆమె సైకిలెక్కారు. కొద్ది రోజుల క్రితం రేణుక అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కాని తర్వాత అలాంటి ఉద్దేశమేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు మరో ఏడాది వరకు సమయం ఉన్నా.. లోకేష్ ముందుగానే ఈ ఇద్దర్ని గెలిపించాలని వ్యాఖ్యానించడం కర్నూలులో మాత్రమే కాదు.. పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారిందట.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.