యాప్నగరం

కిడారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్

ఎమ్మెల్యే కిడారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి లోకేష్. బాధిత కుటంబానికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన మంత్రి..

Samayam Telugu 10 Oct 2018, 2:25 pm
మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. బుధవారం ఉదయం విశాఖ నుంచి మంత్రి పాడేరు చేరుకున్నారు. కిడారి ఇంటికి వెళ్లిన లోకేష్.. ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్వేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు. టీడీపీ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Samayam Telugu Lokesh


కిడారి మృతి పార్టీకి తీరని లోటని మంత్రి లోకేష్ అన్నారు. గిరిజనులకు ఆయన చేసిన సేవల్ని మంత్రి కొనియాడారు. ప్రతి నిమిషం ఆయన గిరిజన ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచించేవారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబాన్ని కూడా మంత్రి పరామర్శిస్తారు. లోకేష్ వెంట మంత్రులు చినరాజప్ప, నక్కా ఆనందబాబు.. ఎమ్మెల్యేలు అనిత, గడ్డి ఈశ్వరిలు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.