యాప్నగరం

ట్రైలరే వచ్చింది.. రాబోయే రోజుల్లో బీజేపీకి సినిమానే: లోకేశ్

కులం,మతం అడ్డం పెట్ఠుకుని రాజకీయాలు చేయాలని చూస్తే ఆటలు సాగనివ్వం. కాబోయే ప్రధాని ఎవరో చంద్రబాబు నిర్ణయిస్తారు. ఏపీ బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ట్ర సమస్యలపై మోదీని నిలదీయాలి.

Samayam Telugu 11 Jan 2019, 4:48 pm

ప్రధానాంశాలు:

  • కేసుల మాఫీ కోసం జగన్ మోదీతో లాలూచీ పడ్డారు
  • జగన్‌ కేసుల్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి
  • వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీదే గెలుపు.. చంద్రబాబు సీఎం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu lokesh.
బీజేపీ ఇప్పటి వరకు చూసింది ట్రైలర్ మాత్రమే.. రాబోయే రోజుల్లో సినిమా చూపిస్తామంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. కమలం పార్టీకి కర్ణాటక ప్రజలు ట్రైలర్ మాత్రమే చూపించారని.. ఏపీ ప్రజలు సినిమా చూపించబోతున్నారని చెప్పారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బీజేపీపై నిప్పులు చెరిగారు.
ప్రధాని నరేంద్ర మోదీ మోనార్క్‌లా మారరని విమర్శించారు లోకేశ్. సీబీఐ, ఆర్బీఐ వంటి స్వతంత్ర వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కులం,మతం అడ్డం పెట్ఠుకుని రాజకీయాలు చేయాలని చూస్తున్నారని.. ఈ ఆటలు సాగనివ్వమన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని ఎవరో చంద్రబాబు నిర్ణయిస్తారని మంత్రి జోస్యం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్ట పడుతుంటే.. ప్రోత్సహం ఇవ్వాల్సిందిపోయి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఏపీ బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ట్ర సమస్యలపై మోదీని నిలదీయాలన్నారు.

జగన్‌‌తో కలిసి మోదీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌ ఏనాడైనా మోదీని నిలదీశారా అని ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో.. జగన్ మోదీపై ఒక్క విమర్శ చేయలేదని గుర్తుచేశారు. జగన్‌పై ఉన్న కేసులను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కేసులు మాఫీ కోసమే జగన్ మోదీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు సైతం కోరుకుంటున్నారని టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంతో తాము పోటీ పడలేక పోతున్నామని.. 20 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు మంత్రి లోకేష్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.