యాప్నగరం

జగన్‌ది క్విడ్ ప్రోకో డ్రామా: మంత్రి లోకేష్

వైసీపీ అధినేత జగన్‌పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. మోదీ కాళ్ల మీద పడుతూ, పీఎంవో చుట్టూ తిరుగుతూ ప్రత్యేక హోదా ముసుగులో... కేసుల మాఫీ కోసం జగన్ మరోసారి క్విడ్ ప్రోకో నాటకం మొదలు పెట్టారని విమర్శించారు.

Samayam Telugu 7 Apr 2018, 12:21 pm
వైసీపీ అధినేత జగన్‌పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించడానికి 5కోట్ల తెలుగు ప్రజలు తమ రోషాన్ని చూపిస్తుంటే... మోదీని నిలదీసే దమ్ము, ధైర్యం లేని జగన్ ప్రజల్ని మోసం చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ కాళ్ల మీద పడుతూ, పీఎంవో చుట్టూ తిరుగుతూ ప్రత్యేక హోదా ముసుగులో కేసుల మాఫీ కోసం జగన్ మరోసారి క్విడ్ ప్రోకో నాటకం మొదలు పెట్టారని విమర్శించారు మంత్రి నారా లోకేష్.
Samayam Telugu Nara Lokesh.


లోకేష్ ఈ మధ్య ట్విట్టర్‌లో యాక్టివ్ అయ్యారు. నిన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విపక్ష ఎంపీలపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఎంపీలను జంతువులతో పోల్చడంపై మండిపడ్డారు. బీజేపీకి వినాశకాలే విపరీత బుద్ధి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇప్పుడు జగన్‌పై సెటైర్లు వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.