యాప్నగరం

ముంబైలో ముకేశ్ అంబానీతో నారా లోకేశ్ భేటీ

ఏపీ మంత్రి నారా లోకేశ్ గురువారం ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతో భేటీ అయ్యారు.

TNN 26 Oct 2017, 11:29 pm
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం ముంబైలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన్ను కోరినట్లు లోకేశ్ తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చే ఉద్దేశంతో ముంబై వెళ్లిన మంత్రి వ్యాపార వేత్తలతో గురువారం భేటీ అయ్యారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Samayam Telugu ap minister nara lokesh meets mukesh ambani in mumbai
ముంబైలో ముకేశ్ అంబానీతో నారా లోకేశ్ భేటీ


Happy to have had an engaging conversation with Mukesh Ambani ji, chairman of Reliance Industries. Welcomed him to invest in our state. — Lokesh Nara (@naralokesh) October 26, 2017
డీసీబీ బ్యాంక్ సీఈవో మురళీ ఎం నటరాజన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన పరాగ్ రావ్, థామ్సన్ రాయిటర్స్ కంపెనీతోపాటు ఆ సంస్థ బ్యాంకింగ్ భాగస్వాములను కలిశానని లోకేశ్ తెలిపారు. ఎల్ అండ్ టీ గ్రూప్ సీఈవో సుబ్రహ్మణ్యన్, స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ సీఐవో జుజార్ తిన్వల్లాతోనూ సమావేశమైనట్లు లోకేశ్ స్పష్టం చేశారు.


రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందని, ఈ రంగాల అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం అనేక పాలసీలు రూపొందిస్తోందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.