యాప్నగరం

వైసీపీది 'కోడి కత్తి' డ్రామా.. అంతా 'జగన్నా'టకం: లోకేష్

అధికారం కోసం అడ్డదారులు తొక్కడం 'జగన్ మోడీ రెడ్డి' కి కొత్త కాదు.. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠం పై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చర్యం లేదు.

Samayam Telugu 26 Oct 2018, 2:32 pm
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై దాడితో ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఈ దాడి వెనుక కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తుంటే.. ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమంటూ టీడీపీ కౌంటర్లు ఇస్తోంది. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తాజాగా మంత్రి లోకేష్ కూడా వైసీపీని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. దాడి పేరుతో డ్రామాలు బాగా ఆడుతున్నారంటూ సెటైర్లు పేల్చారు.
Samayam Telugu Lokesh.


లోకేష్ తన ట్వీట్లలో.. ‘వైసీపీ కోడి కత్తి డ్రామా!.. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం 'జగన్ మోదీ రెడ్డి' కి కొత్త కాదు. మరో సారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైఎస్సార్‌సీపీ కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైసీపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ విమర్శించారు’లోకేష్.

మరో ట్వీట్‌లో ‘తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠం పై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమేనన్నారు’మంత్రి. ట్వీట్ చివరిలో #Jagannatakam అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టారు.

మూడో ట్వీట్‌లో.. ‘ఫిన్ టెక్ కార్యక్రమాన్ని భగ్నం చేయడం, అటు ప్రజల సానుభూతిని పొందడం - ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుకున్నాడు జగన్. కానీ ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుగుతున్నా అదే సమయంలో ఏదో ఒక అలజడి సృష్టించడం వరుసగా చూస్తూ వస్తున్నదే కాబట్టి జగన్ నాటకానికి ఏ ప్రయోజనమూ దక్కలేదు’అన్నారు. మరి లోకేష్ విమర్శలకు వైసీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి మరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.