యాప్నగరం

నారాయణ పుష్కరఘాట్ల సందర్శన

వచ్చే నెలాఖరునాటికి కృష్ణాపుష్కర పనులన్నింటినీ పూర్తిచేస్తామని ఆంధ్ర పురపాలక మంత్రి నారాయణ చెప్పారు

TNN 15 May 2016, 6:08 pm
వచ్చే నెలాఖరునాటికి కృష్ణాపుష్కర పనులన్నింటినీ పూర్తిచేస్తామని ఆంధ్ర పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. ఆదివారం నాడు ఆయన విజయవాడ నగరంలో పుష్కర పనులను పరిశీలించారు. విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ వీరపాండ్యన్ తదితర అధికారులతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కొన్ని ప్రాంతాల్లో పనులు నత్తనడకన సాగుతున్నట్లు మంత్రి గమనించారు. వాటిని వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గత ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేర్పిన పాఠాలతో కృష్ణాపుష్కరాల్లో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటున్నామన్నారు. ఈ పుష్కరాలకు ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణాగోదావరి సంగమ ప్రాంతం వద్ద కూడా ప్రత్యేకంగా ఘాట్ ఒకదాన్ని ప్రభుత్వం నెలకొల్పనుందని చెప్పారు. కీలకమైన ఇంద్రకీలాద్రి వద్ద దుర్గాఘాట్ విస్తీర్ణాన్ని పెంచుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన తన పర్యటనలో కృష్ణలంక, భవానీపురం, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాలను సందర్శించారు. నగరంలో పలు చోట్ల పుష్కర నగర్లను కూడా ఏర్పాటుచేయనున్నామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.