యాప్నగరం

వైసీపీలో చేరను.. అదంతా దుష్ప్రచారం: ఏపీ మంత్రి సోదరుడు

ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు సోదరుడు వైసీపీలో చేరబోతున్నారా? త్వరలో జిల్లాలో జరగబోయే ప్రజా సంకల్ప యాత్రలో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారా? పార్టీ మార్పుపై బేబీ నాయన ఏమంటున్నారంటే..

Samayam Telugu 2 Sep 2018, 6:50 pm
ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు సోదరుడు బేబీ నాయన వైసీపీ గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలో చేరడం ఖాయమంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారానికి బేబీ నాయన పుల్‌స్టాప్ పెట్టారు. తాను పార్టీ మారడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. తాను వైసీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. కొన్ని పత్రికల్లో, సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
Samayam Telugu Baby Nayana


ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికోసం టీడీపీలో చేరామని.. పదవుల్ని తాను ఏనాడూ ఆశించలేదన్నారు బేబీ నాయన. 2004లోనే కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినా.. వయస్సు సరిపోక కుదరలేదన్నారు. అందుకే తన సోదరుడు రంగారావు పోటీ చేశారని.. 2009లో కూడా తనను పోటీ చేయమని రంగారావు కోరినా.. ఆయనపై ఉన్న అభిమానంతో తిరస్కరించానన్నారు. 2014లో ఆయన్నే నిలబెట్టామని.. చంద్రబాబు నాయకత్వంలో 2019లో కూడా సుజయ టీడీపీ నుంచే బరిలోకి దిగబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తన సోదరుడు రంగారావుతో విభేదాలు సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రచారం జరుగుతోందని.. వీటిని నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు నమ్మొద్దని విజ్ఞ‌ప్తి చేశారు.

2014లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన సుజయ కృష్ణ రంగారావు.. ఆయన సోదరుడు బేబీ నాయనతో కలిసి టీడీపీలో చేరారు. తర్వాత సుజయకు ఏపీ మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర బొగ్గు గనులశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.