యాప్నగరం

అన్న ప్రాసన రోజే ఆవకాయ తింటారా..పవన్‌కు ఏపీ మంత్రి చురక

సీఎం చంద్రబాబు, టీడీపీపై... పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు పడుతున్నాయి. జనసేనాని టార్గెట్‌గా... మంత్రులు, టీడీపీ నేతల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి.

Samayam Telugu 21 May 2018, 5:16 pm
సీఎం చంద్రబాబు, టీడీపీపై... పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు పడుతున్నాయి. జనసేనాని టార్గెట్‌గా... మంత్రులు, టీడీపీ నేతల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న పవన్ వ్యాఖ్యలకు మంత్రి కేఈ కృష్ణమూర్తి గట్టి కౌంటర్ ఇచ్చారు. అన్న ప్రాసన రోజే ఆవకాయ తింటాను అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంపై పోరాడుతున్న తాము బీజేపీకి భయపడతామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలన్నీ నిరాధారమన్నారు మరో మంత్రి నక్కా ఆనంద బాబు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని... 2009 నుంచి కొనసాగుతున్నారని గుర్తు చేశారు. 2014లో జనసేన పోటీ చేసినా టీడీపీకి నష్టం ఉండేది కాదని వ్యాఖ్యానించారు.
Samayam Telugu Pawan


2014లో పవన్, జనసేన మద్దతు కాదు... చంద్రబాబును చూసి ప్రజలు ఓట్లేశారన్నారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. తన దయతోనే టీడీపీ గెలించిందని పవన్ చెబుతున్నారని... మరి గతంలో ఆయన అన్న పెట్టిన ప్రజారాజ్యాన్ని ఎందుకు గెలిపించుకోలేకపోయారో చెప్పాలన్నారు. చిరంజీవి సొంత బంధువులే ఓడిపోయారన్న విషయాన్ని కూడా మర్చిపోకూడదన్నారు. తాను ఎటువైపు చెయ్యి ఊపితే అటు ఓట్లు పడతాయని మీటింగుల్లో చెప్పినంత సులభం కాదన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్షన్‌లోనే ఏపీలోని నాలుగు పార్టీలు పని చేస్తున్నాయని విమర్శించారు వెంకన్న. ఆ పార్టీల నేతలంతా ఒక తానులోని మొక్కలేనని ఎద్దేవా చేశారు. ఎవరేం చేసినా... టీడీపీ దగ్గర పప్పులు ఉడకవన్నారు టీడీపీ ఎమ్మెల్సీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.