యాప్నగరం

కాంగ్రెస్‌తో పొత్తా.. ఆ దరిద్రం మాకెందుకు: ఏపీ మంత్రులు

2019 ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతోంది. మహా అంటే మరో ఎనిమిది, తొమ్మిది నెలల్లో ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది.ఇలాంటి సమయంలోనే పొత్తుల ఎత్తులపై ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ-కాంగ్రెస్ జతకట్టబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

Samayam Telugu 23 Aug 2018, 8:53 pm
2019 ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతోంది. మహా అంటే మరో ఎనిమిది, తొమ్మిది నెలల్లో ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలన్నీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాయి. ఇలాంటి సమయంలోనే పొత్తుల ఎత్తులపై ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ-కాంగ్రెస్ జతకట్టబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయబోతున్నాయంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి.
Samayam Telugu Ministers


కాంగ్రెస్‌తో పొత్తు వార్తలపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఛాన్సే లేదని కొట్టిపారేస్తున్నారు. పొత్తు వ్యవహారంపై డిప్యూటీ సీఎం కేఈ కేఈ కృష్ణమూర్తి స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు ప్రసక్తే లేదని.. కాంగ్రెస్, బీజేపీ, జగన్, పవన్ టీడీపీకి ప్రత్యర్థులేనన్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయబోతున్నామంటూ జగన్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని.. కాంగ్రెస్ దరిద్రాన్ని తాము అంటగట్టుకోమని వ్యాఖ్యానించారు కేఈ.

పొత్తులపై మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా స్పందించారట. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ టీడీపీ అని.. అలాంటిది ఆ పార్టీతో ఎలా చేతులు కలుపుతామన్నారట మంత్రి. కర్మకాలి వాళ్లతో పొత్తు పెట్టుకుంటే.. చంద్రబాబు తప్పు చేసినట్లేనని అభిప్రాయపడ్డారట. ప్రజలు కూడా తమను క్షమించరని.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారని తాను అనుకోవట్లేదన్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.