గవర్నర్ను టార్గెట్ చేసిన ఏపీ మంత్రులు
గవర్నర్ నరసింహన్పై మండిపడ్డారు ఏపీ మంత్రులు నక్కా ఆనందబాబు, మంత్రి కాల్వ శ్రీనివాసులు. రాజకీయ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఏంటంటూ విమర్శించారు.
Samayam Telugu 25 Apr 2018, 4:01 pm
గవర్నర్ నరసింహన్పై మండిపడ్డారు ఏపీ మంత్రులు నక్కా ఆనందబాబు, మంత్రి కాల్వ శ్రీనివాసులు. రాజకీయ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఏంటంటూ విమర్శించారు. అన్ని కుట్రల్లో గవర్నర్ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని... అసలు వైఖరి ఇప్పుడు బయటపడిందనే తాము వ్యతిరేకిస్తున్నామరు మంత్రి ఆనందబాబు. కొన్ని కుట్రల్లో గవర్నర్ పాత్ర ఉందని ఆరోపించారు. ఏళ్ల తరబడి ఒకే గవర్నర్ ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించిన ఆయన... మొదటి నుంచి తాము గవర్నర్ వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.
గవర్నర్ పనితీరు అసంతృప్తిగా ఉందన్నారు మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఢిల్లీని ఢీకొడుతుంటే... కేంద్రానికి ఆయన దూతలా వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందని గుర్తు చేసిన ఆయన... విభజన చట్టం హామీలు అమలు అయ్యేలా గవర్నర్ చూడాలన్నారు కాల్వ. నిన్న గవర్నర్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయగా... ఇవాళ మంత్రులు కూడా విమర్శలు చేయడం ఆసక్తిగా మారింది.
గవర్నర్ పనితీరు అసంతృప్తిగా ఉందన్నారు మరో మంత్రి కాల్వ శ్రీనివాసులు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఢిల్లీని ఢీకొడుతుంటే... కేంద్రానికి ఆయన దూతలా వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందని గుర్తు చేసిన ఆయన... విభజన చట్టం హామీలు అమలు అయ్యేలా గవర్నర్ చూడాలన్నారు కాల్వ. నిన్న గవర్నర్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయగా... ఇవాళ మంత్రులు కూడా విమర్శలు చేయడం ఆసక్తిగా మారింది.