యాప్నగరం

TDP: జగన్‌ది గోబెల్స్ ప్రచారం.. 2019లో ప్రధాని ఎవరో నిర్ణయించేది టీడీపీ - మంత్రి యనమల

2019లో ప్రధాని ఎవరో నిర్ణయించేది టీడీపీనే అంటున్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మాట్లాడిన మంత్రి తాజా రాజకీయాలు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ తీరుపై స్పందించారు.

Samayam Telugu 22 Aug 2018, 4:08 pm
2019లో ప్రధాని ఎవరో నిర్ణయించేది టీడీపీనే అంటున్నారు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మాట్లాడిన మంత్రి తాజా రాజకీయాలు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ తీరుపై స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ఏర్పడేది బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వమేనంటున్నారు యనమల. ఈ రెండు పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలను ఏకం చేయగల సత్తా కూడా టీడీపీకి మాత్రమే ఉందని.. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 2104లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న మంత్రి.. కేంద్రం మోసం చేయడంతోనే ఎన్డీఏ నుంచి బయటకొచ్చామన్నారు.
Samayam Telugu Yanamala.


2019లో టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు యనమల. ఈ విషయం తెలిసే వైసీపీ అధినేత జగన్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి పంచన చేరాల్సిన అవసరం టీడీపీకి లేదని.. జగనే కేసులకు భయపడి బీజేపీ పంచన చేరారని విమర్శించారు. ఇప్పుడు కేసుల మాఫీ కోసం ఇప్పుడు పీఎంవో చుట్టూ తిరుగుతున్నారన్నారు. 2019 ఎన్నికల తర్వాత జగన్, వాళ్ల మీడియా కనుమరుగవుతుందన్నారు.

జగన్‌పై మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మండిపడ్డారు. పెళ్లిళ్లంటూ ప్రతిపక్ష నేత టీడీపీపై చేసిన విమర్శలకు మంత్రి కౌంటరిచ్చారు. పెళ్లిళ్లంటూ వ్యాఖ్యలు చేస్తూ జగన్ టీడీపీని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు జగన్ తన స్వార్థం కోసం చేసుకున్న పెళ్లిళ్లు ఎన్నో లెక్క ఉందా అని ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడేందుకు ఆయన ఎవరినైనా పెళ్లి చేసుకుంటారని.. ఇప్పుడు జనసేనతోనూ పెళ్లి ఖాయమైందని స్వయంగా ఆ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ చెబుతున్నారని వ్యాఖ్యానించారు సోమిరెడ్డి.

చట్ట సభల్లో కూడా ప్రధాని మోదీని వ్యతిరేకించిన దమ్ము టీడీపీకి ఉందని.. జగన్‌లా కేసులకు భయపడేది లేదన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ అవసరముందని.. జాతీయ రాజకీయాలకు అనుగుణంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్న మంత్రి.. తాముఎవరితో పొత్తు పెట్టుకున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.