యాప్నగరం

ఏపీకి అన్యాయంపై ఎంపీల నిరసన గళం

బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ ఏపీ ఎంపీలు గళం విప్పారు. పార్లమెంట్‌తో పాటూ ఆవరణలోనూ ఆందోళన చేపట్టారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు విడివిడిగా నిరసనకు దిగారు.

TNN 6 Feb 2018, 11:53 am
బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ ఏపీ ఎంపీలు గళం విప్పారు. పార్లమెంట్‌తో పాటూ ఆవరణలోనూ ఆందోళన చేపట్టారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు విడివిడిగా నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం దగ్గర తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాత్రం కాస్త వెరైటీగా తన నిరసనను తెలియజేశారు. చిడతలు వాయిస్తూ... తన పాటలతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఇటు వైసీపీ ఎంపీలు గేటు దగ్గర నిరసన చేపట్టారు. వారు కూడా ప్లకార్డులతో సేవ్ ఏపీ అంటూ నినాదాలు చేశారు.
Samayam Telugu ap mps protest in parliament
ఏపీకి అన్యాయంపై ఎంపీల నిరసన గళం





సభలో కూడా ఎంపీల ఆందోళన కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో ఆందోళనకు దిగారు. ఏపీని కాపాండంటూ నినాదాలు చేశారు. ఆందోళన విరమించాలని స్పీకర్ పదే, పదే విజ్ఞ‌ప్తి చేసినా వెనక్కు తగ్గలేదు. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. సభ వాయిదా తర్వాత మళ్లీ బయటకు వచ్చి నిరసనను కొనసాగించారు. మరోవైపు కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రధాని మోడీతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ భేటీలో బడ్జెట్ అంశాలతో పాటూ... విభజన హామీలపై చర్చించినట్లు సమాచారం. అలాగే ఎంపీలు కూడా మోడీని కలిసే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.