యాప్నగరం

ఢిల్లీ చేరుకున్న జగన్.. కరచాలనం చేసేందుకు ఎగబడిన అభిమానులు

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని, ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ విన్నవించనున్నారు. ఉదయం ఢిల్లీ చేరుకున్న జగన్.. మరికాసేపట్లో ప్రధాన మంత్రిని కలవనున్నారు.

Samayam Telugu 26 May 2019, 10:44 am
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో దిగిన వైఎస్ జగన్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న తరవాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. దీంతో జగన్ కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఓ వైపు అభిమానులు, మరోవైపు మీడియా జగన్‌ను ఊపిరి పీల్చుకోనివ్వలేదు.
Samayam Telugu Jagan

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని, ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ విన్నవించనున్నారు. ఉదయం ఢిల్లీ చేరుకున్న జగన్.. మరికాసేపట్లో ప్రధాన మంత్రిని కలవనున్నారు. ముందుగా రెండో సారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలపనున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య భేటీ జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై మోదీతో జగన్‌ చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్న విషయం తెలిసిందే. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీని జగన్ ఆహ్వానించనున్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. జగన్ వెంట ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎంపీలు అవినాష్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డి, నందిగాం సురేష్‌ ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.