యాప్నగరం

వైసీపీలో మార్పొచ్చింది.. నాపై అభిమానం పెరిగింది: బాబు వ్యాఖ్యలతో జగన్ నవ్వులు

అసెంబ్లీలో నవ్వులు పూయించిన చంద్రబాబు. వైసీపీకి తనపై ప్రేమ పెరిగిందంటూ చలోక్తులు విసిరిన ప్రతిపక్ష నేత. చంద్రబాబు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ నవ్వులు. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.

Samayam Telugu 25 Jul 2019, 6:14 pm
ఏపీ అసెంబ్లీ గురువారం వాడీవేడిగా నడిచింది. గోదావరి జలాలు, తెలుగు రాష్ట్రాల నీటి పంపకాలపై అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ హీట్ పెంచారు. ఈ మధ్యలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో నవ్వులు పూయించారు. సభలో జలాల వినయోగంపై పయ్యావుల కేశవ్ మాట్లాడిన తర్వాత చంద్రబాబుకు స్పీకర్ అవకాశం కల్పించారు. తనకు ఛాన్స్ రావడంతో చంద్రబాబు చలోక్తులు విసిరారు.
Samayam Telugu babu.


వైసీపీకి తనపై అభిమానం పెరిగిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ అభిమానం చూసి ఆశ్చర్యమేస్తోందంటూ నవ్వారు. వైసీపీలో చాలా మార్పు వచ్చింది.. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా మారిపోయిందన్నారు. ఇదంతా చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరిసాయి. ముఖ్యమంత్రి జగన్‌తో పాటూ మంత్రులు.. వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు నవ్వారు.

ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే సభలో గురువారం మాత్రం ఈ ఎపిసోడ్‌తో అందరూ హాయిగా నవ్వుకున్నారు. మళ్లీ కొద్దిసేపటికే సభలో హీట్ పెరిగింది. గోదావరి జలాలు, నీటి పంపకాలపై మళ్లీ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. జగన్ సమాధానం ఇస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు అడ్డు తగలడంతో నలుగుర్ని స్పీకర్ సస్పెండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.