యాప్నగరం

ఏపీ సచివాలయంలో కంప్యూటర్లు హ్యాక్

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి ర్యాన్ సమ్ వేర్ హ్యాకింగ్‌ సెగ తాకింది. సచివాలయం నాలుగో భవనంలో ఉన్న రెవెన్యూ

Samayam Telugu 17 May 2017, 6:03 pm
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి ర్యాన్ సమ్ వేర్ హ్యాకింగ్‌ సెగ తాకింది. సచివాలయం నాలుగో భవనంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు చెందిన 20 కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ఐటీశాఖ గుర్తించింది. ఇతర విభాగాలు కూడా హ్యాకింగ్ కు గురయ్యాయా అన్న కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.
Samayam Telugu ap secretariat his by hacking 20 computers affected
ఏపీ సచివాలయంలో కంప్యూటర్లు హ్యాక్


రెవెన్యూ శాఖ మినహా మిగిలిన డిపార్ట్ మెంట్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఐటీ విభాగం పేర్కొంది. హ్యాకింగ్‌కు గురైన కంప్యూటర్ల హార్డ్ డిస్కులను ఐటీ నిపుణులు రీరైట్‌ చేస్తున్నారు.

ప్రపంచాన్ని హ్యాకింగ్ ఊపేస్తోంది. మంగళవారం హ్యాకింగ్ బెడదకు తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.