యాప్నగరం

ఇది బీజేపీ, టీడీపీ కుటుంబ సమస్య కాదు: శివాజీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశమేమైనా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల కుటుంబ సమస్యా అని సినీ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ ప్రశ్నించారు.

TNN 14 Sep 2016, 5:13 pm
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశమేమైనా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల కుటుంబ సమస్యా అని సినీ నటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ ప్రశ్నించారు. సమితి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. నాడు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు రావని వెంకయ్యనాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. హోదా వస్తే సంవత్సరానికి రూ. 60 కోట్ల ప్రయోజనాలు చేకూరతాయని వివరించారు. ప్యాకేజీ ఒక డ్రామా అని, పోలవరం జాతీయ అంశమైతే దాన్ని ప్యాకేజీలో ఎందుకు పొందుపరిచారని విరుచుకుపడ్డారు. హోదా కావాలని ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేయడమేంటని మండిపడ్డారు. వేరే దేశాలకు నిధులు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడంలేదన్నారు.
Samayam Telugu ap special status issue sivaji press meet
ఇది బీజేపీ, టీడీపీ కుటుంబ సమస్య కాదు: శివాజీ

వెంకయ్యనాయుడు ప్రాయోజిక కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి ప్రయోజం చేకూరే పనులేవీ చేయడంలేదని చలసాని శ్రీనివాస్ విమర్శించారు. హోదా వల్ల ప్రయోజనం లేదని సుజనా చౌదరి చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇకనైనా రాష్ట్ర ప్రజలను మోసం చేయడం మానండని శ్రీనివాస్ మండిపడ్డారు. కాగా, ‘జాబు కావాలంటే హోదా రావాలి’ అనే నినాదంతో ప్రత్యేక హోదా సాధన సమితి ప్రచార సామాగ్రిని విడుదల చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.