యాప్నగరం

ప్రత్యేక హోదా పోరు: ఏపీలో వైసీపీ రైల్‌రోకో

ఏపీలో ప్రత్యేక హోదా పోరు ఉధృతమవుతోంది. వైసీపీ ఎంపీలు అటు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తుంటే... వారికి మద్దతుగా హోదా కోసం పార్టీ శ్రేణులు ఏపీలో ఆందోళనలు చేస్తున్నాయి. నిన్న హైవేలను దిగ్బంధించగా... ఇవాళ రైల్ రోకోకు పిలుపునిచ్చారు.

Samayam Telugu 11 Apr 2018, 8:25 am
ఏపీలో ప్రత్యేక హోదా పోరు ఉధృతమవుతోంది. వైసీపీ ఎంపీలు అటు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తుంటే... వారికి మద్దతుగా హోదా కోసం పార్టీ శ్రేణులు ఏపీలో ఆందోళనలు చేస్తున్నాయి. నిన్న హైవేలను దిగ్బంధించగా... ఇవాళ రైల్ రోకోకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు రైల్వే స్టేషన్ల ముట్టడికి బయల్దేరారు. పట్టాలపై బైఠాయించి రైళ్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ రైల్ రోకోకు పిలుపునివ్వడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా బలగాలను మోహరించారు.
Samayam Telugu Rail Roko-1


నిన్న కూడా వైసీపీ హైవేలను దిగ్బంధించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా వైసీపీ శ్రేణులు తమ నిరసనల్ని కొనసాగించారు. రోడ్లపై బైఠాయించి హోదా నినాదాన్ని వినిపించారు. అదే ఉత్సాహంతో ఇవాళ కూడా ఆందోళనల్ని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు వైసీపీ నేతలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.