యాప్నగరం

తప్పు చేస్తే ఎవరినీ వదిలి పెట్టనన్న చంద్రబాబు

నారాయణ పాఠశాలలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై చంద్రబాబు మాట్లాడారు.

TNN 30 Mar 2017, 2:17 pm
నెల్లూరు జిల్లాలో నారాయణ పాఠశాలలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై చంద్రబాబు మాట్లాడారు. ప్రశ్నాపత్రం లీకుపై విచారణ జరుగుతోందని, తప్పు ఎవరిదో తేలితే కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పు చేసిన వారు ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా వదిలిపెట్టనని అన్నారు. అది నారాయణ కాలేజీ అయినా జగన్ అయినా ఒకటేనని అన్నారు. తప్పుచేసిన వారిపట్ల తాను చండశాసనుడిగా ఉంటానని చెప్పారు. ఈ నెల 26న లీకేజీ ఘటనపై డీఈవో తనకు నివేదిక పంపారని చెప్పారు. నారాయణ పాఠశాలలో ఘటన జరిగిన సమయంలో ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారని చెప్పారు. ఇన్విజిలేటర్, ఆఫీస్ బాయ్ సెల్ ఫోన్లను సీజ్ చేసినట్టు చెప్పారు. ఆ ఘటనలో ఏడుగురిని రిలీవ్ చేశారని, ఒకరిని సస్పెండ్ చేశారని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తప్పు నిర్ధారణ అయితే అరెస్టు చేయిస్తానని అన్నారు.
Samayam Telugu apcm chandra babu fires on jagan over ssc paper leakage in ap assembly
తప్పు చేస్తే ఎవరినీ వదిలి పెట్టనన్న చంద్రబాబు


లీకేజీలో వ్యవహారంపై సాక్షి విలేకరి తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని అన్నారు. జగన్ ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు... జగన్ ప్రతిపక్ష నేత కాబట్టి ఇలా సమాధానం ఇస్తున్నానని, లేకుంటే ఆయన పోలీసుల దృష్టిలో ఉగ్రవాది, ఆర్థిక నేరస్థుడని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.