యాప్నగరం

ఆ ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు

సొంత పార్టీలోని వ్యక్తే విమర్శించడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

TNN 16 Apr 2017, 7:09 am
టీడీపీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నేరుగా చంద్రబాబుపైనే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దళితులకు సంక్షేమ పథకాల్లో తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని అన్నారు. చిత్తూరులోని ఓ సభలో ఆయన ఇలా మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలకు మంత్రి పదవులు కేవలం రెండే ఇచ్చారని అన్నారు. సీఎంను కొంతమంది మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దీనిపై చంద్రబాబు చాలా ఆగ్రహంగా ఉన్నారు. పార్టీలో అంతర్లీనంగా చర్చించాల్సిన విషయాలను ఇలా బహిరంగంగా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Samayam Telugu apcm chandrababu fires on mp sivapradad
ఆ ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు


రెండు సార్లు ఎంపీ శివప్రసాద్ ఈ రకంగా మీడియా ముందు మాట్లాడడం పార్టీకి ఇబ్బందిగా మారిందని ఆయన మంత్రులతో అన్నారు. అనంతరం చిత్తూరు జిల్లా నేతలతో మాట్లాడి... వివరాలు తెలుసుకున్నారు. ఆయన పద్దతి అస్సలు బాగోలేదని అన్నారు. అంబేద్కర్ జయంతి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే... చివర్లో ఇలా జరిగిందేంటని అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యనేతలతో మాట్లాడిన చంద్రబాబు సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆరు నెలల నుంచి శివప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు నేతలు. దళితులకు భూమి ఇచ్చే విషయంలోనే శివప్రసాద్ అసంతృప్తిగా ఉన్నాడని, అందుకే ఇలా విమర్శలు చేసినట్టు చంద్రబాబు భావిస్తున్నారు. క్రమశిక్షణా చర్యలు మాత్రం శివప్రసాద్ పై తీసుకోక తప్పదని చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.