యాప్నగరం

​చంద్రబాబుపై పుస్తకం విడుదల చేసిన రఘువీర!

గత మూడేళ్లలో తెలుగుదేశం నేతలు ఇసుక రీచ్ ల ద్వారా రూ.29 వేల కోట్ల రూపాయలు

TNN 18 Jun 2017, 1:04 pm
ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఆరువందల హామీలను ఇచ్చిందని, వాటిని అడ్డం పెట్టుకుని అధికారాన్ని పొందిన తర్వాత మాత్రం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా తెలుగుదేశం నేతలంతా ఆర్థిక నేరగాళ్లే అని రఘువీర ఆరోపించారు. విజయవాడలోని కాంగ్రెస్ ఆఫీసులో శుక్రవారం చంద్రబాబు మూడేళ్ల పాలనపై ‘దోపిడీబాబు’ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారయన.
Samayam Telugu appcc released book on cbn
​చంద్రబాబుపై పుస్తకం విడుదల చేసిన రఘువీర!


గత మూడేళ్లలో తెలుగుదేశం నేతలు ఇసుక రీచ్ ల ద్వారా రూ.29 వేల కోట్ల రూపాయలు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రూ.40 వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని రఘువీరా రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి 2029,2050 అంటూ చంద్రబాబు బూటకపు మాటలు చెబుతున్నారని, ఏపీ నంబర్ వన్ అంటూ తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

బాబు అబద్ధాలు చెప్పడంలో నంబర్ వన్, చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో నంబర్ వన్ అని అన్నారు. దీపక్ రెడ్డి నేరస్తుడు అని తెలిశాకా కూడా చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్లు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.