యాప్నగరం

హిందువుల భావాలపై గౌరవంతోనే గో రక్షా దళ్: అలీ బిన్ అబ్దుల్లా

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవులను సంరక్షించే దిశగా ‘ఆల్ ఇండియా అరబ్ గో రక్షక్ దళ్’ ప్రచారాన్ని ఉధృతం చేసింది. బక్రీద్ పర్వదినం నేపథ్యంలో ముస్లిం వర్గాలు గోవులను వధించకుండా అడ్డుకోడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.

Samayam Telugu 21 Aug 2018, 9:01 pm
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గోవులను సంరక్షించే దిశగా ‘ఆల్ ఇండియా అరబ్ గో రక్షా దళ్’ ప్రచారాన్ని ఉధృతం చేసింది. బక్రీద్ పర్వదినం నేపథ్యంలో ముస్లిం వర్గాలు గోవులను వధించకుండా అడ్డుకోడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఇతర మతస్థుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరాన్ని విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలోనూ పలు వీధుల్లో ప్రచారం కల్పించారు. ‘గో రక్షా దళ్’ ఏర్పాటు చేసి ఈ ఏడాదితో అయిదేళ్లు పూర్తవుతుండటం మరో విశేషం. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపకుడు అలీ బిన్ అబ్దుల్లా బహమద్‌ను ‘సమయం’ ప్రతినిధి పలకరించినప్పుడు ఆసక్తికర వివరాలు తెలిపారు.
Samayam Telugu raksha


బుధవారం (ఆగస్టు 22) బక్రీద్ పండగ నేపథ్యంలో గో వధను అడ్డుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అలీ చెప్పారు. ఆయా వర్గాల ప్రజలు కూడా తమ వాదనను సామరస్యంగా వింటున్నారని, సానుకూలంగా స్పందిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ ప్రారంభించిన మొదట్లో కొంత మంది నుంచి బెదిరింపులు ఎదురయ్యాయని, అయితే.. ఏటికేడు ఆ పరిస్థితిలో గణనీయంగా మార్పు వస్తోందని అలీ తెలిపారు.
‘దేశంలో సామాన్య ప్రజల మనోభావాలను ముస్లిం వర్గాలు అర్థం చేసుకుంటున్నాయి. ఉలేమాలు, పలువురు రాజకీయ నాయకులు మా ప్రయత్నానికి మద్దతు తెలుపుతున్నారు. గతంలో మాపై కొంత మంది దాడులు చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అన్ని సంస్కృతులను కలుపుకొని నడవడానికి చాలా మంది ముందుకువస్తున్నారు.’ అని అలీ తెలిపారు. గోవులను కాపడే ఏకైక ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన అలీ.. దేశంలో గో వధను పూర్తిగా నిషేధించడమే తమ లక్ష్యమని తెలుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.