యాప్నగరం

ఎంపీని పట్టించుకోని అధికారులు.. రోడ్డుపై బైఠాయింపు

ఎంపీ పర్యటనకు వస్తున్నారంటే హడావిడి ఎలా ఉంటుంది. ప్రోటాకాల్ ప్రకారం అధికారులు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూడాలి. అందరికంటే ముందు వచ్చి ఉండాలి. కాని అక్కడి అధికారులు మాత్రం ఎంపీగారిని అసలు పట్టించుకోలేదట. ఆలస్యంగా వచ్చి... తమకేం పట్టనట్లు వ్యవహరించారు. దీంతో ఎంపీకి కోపం వచ్చింది. తానొస్తున్నానని తెలిసినా ఆలస్యమేంటని మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

TNN 19 Feb 2018, 1:02 pm
ఎంపీ పర్యటనకు వస్తున్నారంటే హడావిడి ఎలా ఉంటుంది. ప్రోటాకాల్ ప్రకారం అధికారులు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూడాలి. అందరికంటే ముందు వచ్చి ఉండాలి. కాని అక్కడి అధికారులు మాత్రం ఎంపీగారిని అసలు పట్టించుకోలేదట. ఆలస్యంగా వచ్చి... తమకేం పట్టనట్లు వ్యవహరించారు. దీంతో ఎంపీకి కోపం వచ్చింది. తానొస్తున్నానని తెలిసినా ఆలస్యమేంటని మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరంటారా... కొత్తపల్లి గీత. అరకు లోక్‌సభ సభ్యురాలు... అనంతగిరి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పర్యవేక్షించాలనుకున్నారు. ఇదే విషయాన్ని అధికారులకు ముందే చెప్పారట. ఈ షెడ్యూల్‌ను ఎంపీడీవో కూడా మీడియాకు విడుదల చేశారు.
Samayam Telugu araku mp geetha protest on road
ఎంపీని పట్టించుకోని అధికారులు.. రోడ్డుపై బైఠాయింపు



తీరా ఎంపీ... అనంతగిరికి వచ్చారు. కాని అప్పటికి అధికారులు మాత్రం అక్కడ కనిపించలేదు. చాలాసేపటి తర్వాత హడావిడిగా కొంతమంది వచ్చారట. దీంతో కొత్తపల్లి గీత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి... ఆందోళనచేశారు. ఈ నిరసనతో అధికారులు షాకయ్యారు. అధికారులు ఆమెకు సర్థి చెప్పాలని చూశారు. కాని ఆమె మాత్రం శాంతించలేదు. ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే... ప్రజలు సమస్యలకు ఎవరికి చెప్పుకుంటారని ఎంపీ మండిపడ్డారు. అంతేకాదు ఎంపీనే ఇలా నిరసన తెలపడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.