యాప్నగరం

సుధీర్ఘ విరామం తరవాత అరకు రైలు పరుగు

కొండల్లో అందమైన సొరంగాల ద్వారా ప్రయాణిస్తూ అరకు, బొర్రా గుహల సందర్శనకు రైలులో వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త.

TNN 11 Dec 2017, 9:56 am
కొండల్లో అందమైన సొరంగాల ద్వారా ప్రయాణిస్తూ అరకు, బొర్రా గుహల సందర్శనకు రైలులో వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. గత రెండు నెలలుగా నిలిచిపోయిన విశాఖపట్నం-కిరండోల్ పాసింజర్ రైలు సోమవారం నుంచి తిరిగి పట్టాలెక్కింది. కొత్తవలస-కిరండోల్ (కేకే) లైనును పునరుద్ధరించడంతో బొర్ర గుహలు, అరకు మీదుగా కిరండోల్ వెళ్లే పాసింజర్ రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించారు. ఈరైలుకి అద్దాల కోచ్‌ను కూడా జతచేశారు. అరకు వరకు ఈ అద్దాల బోగీని నడుపుతారు.
Samayam Telugu araku train starts from today after two months gap
సుధీర్ఘ విరామం తరవాత అరకు రైలు పరుగు


బొర్రా-చిమిడిపల్లి స్టేషన్‌ల మధ్య 32వ టన్నెల్ వద్ద అక్టోబర్ 6న కొండరాళ్లు జారి పడడంతో వంతెన పిల్లర్ కూలిపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీని మరమ్మత్తులకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అంత వరకు ఈ మార్గంలో అన్ని రైళ్ల సర్వీసులను రద్దుచేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. అయితే కేకే లైనును పునరుద్ధరించడానికి తీవ్రంగా శ్రమించిన రైల్వే అధికారులు, సిబ్బంది, కార్మికులు రెండు నెలల్లోనే పనులను పూర్తి చేశారు. 100 అడుగుల ఎత్తైన వంతెన పిల్లర్‌ను పునర్నిర్మించారు.

దీంతో 66 రోజులపాటు నిలిచిపోయిన విశాఖపట్నం - కిరండోల్ - విశాఖపట్నం (58501/58502) ప్యాసింజర్ రైలు తిరిగి పట్టాలపై పరుగులు ప్రారంభించింది. మరోవైపు రెండు నెలలపాటు కేకే లైనులో ముడిఖనిజం రవాణా ఆగిపోవడంతో రైల్వేకు రూ.300 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. అలాగే వంతెన నిర్మాణం కోసం రూ.10 కోట్లు ఖర్చుచేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే పేర్కొంది. కేకే లైన్‌లో ఇంత ఎక్కువ కాలం రాకపోకలు నిలిచిపోవడం ఇదే ప్రథమం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.