రోజా వ్యవహారంపై ఏపీ శాసనసభ వ్యవహారాలశాఖ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు రోజా వ్యవహారశైలిపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిప్పులు చెరిగారు. ఆమె పద్దతి అస్సలు బాగోలేదని, దళితులను, సాటి మహిళలను ఆమె తరుచూ అవమానిస్తోందని ఆరోపించారు. రోజాను సరైన దారిలో పెట్టుకోవాలని... లేకుంటే జగన్ ప్రతిపక్షనేత హోదాను కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. హైకోర్టు తీర్పుపై సభాపతి నిర్ణయం వచ్చే వరకు ఓపిక పట్టలేక ఇంత రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.
పిటిషన్ దాఖలు చేసిన ఏపీ అసెంబ్లీ కార్యదర్శి
రోజా వ్యవహారంపై ఏపీ శాసనసభ వ్యవహారాలశాఖ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు.
TNN 18 Mar 2016, 11:35 am