ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సభా వ్యవహారాలు నడిపించేందుకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. అమరావతిలో కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. అమరావతి వేదికగా పాలన అందించేందుకు మొత్తం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి శాసనసభ ఉద్యోగులు అమరావతి అసెంబ్లీ భవనం వేదికగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. కొత్త అసెంబ్లీ భవనంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ ఉద్యోగులు బాధ్యతలు చేపట్టనున్నారు. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాలు ఇక్కడి నుంచే జరగనున్నాయి.
అమరావతిలో సిద్ధమైన అసెంబ్లీ భవనం!
రాజధాని అమరావతి సభా వ్యవహారాలు నడిపించేందుకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.
TNN 25 Feb 2017, 6:46 pm