యాప్నగరం

రాజ్‌భవన్‌లో ఆహ్లాదంగా 'ఎట్ హోం'.. ప్రధానాకర్షణగా నిలిచిన కేసీఆర్, జానా!

స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం (ఆగస్టు 15) రాజ్‌భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Samayam Telugu 15 Aug 2018, 7:53 pm
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం (ఆగస్టు 15) రాజ్‌భవన్‌లో నిర్వహించిన 'ఎట్ హోమ్' కార్యక్రమం ఆహ్లాద వాతావరణంలో జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నరు నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్షనేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైకోర్టు సీజే, మంత్రులు, బీజేపీ నేత లక్ష్మణ్, స్పీకర్ మధుసూదనాచారితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారందరికీ గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానం పలికారు.
Samayam Telugu at home


అయితే.. విందులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్, జానారెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. అయితే కేసీఆర్, జానారెడ్డి ఒకరికొకరు కరచాలనం చేసుకుని.. ఆప్యాయంగా కాసేపు మాట్లాడుకున్నారు. తేనీటీ విందులో వీరిరువురు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు హాజరుకాలేదు. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఎంపీ సుజనాచౌదరి హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.